![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:25 PM
యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో చోటుచేసుకుంది. రాజంపేటకు చెందిన జోగిపేట రంజిత్ రెడ్డి(25)కి మతిస్థిమితం సరిగా లేక ఏ పని చేయకుండా గ్రామంలో తిరిగేవాడు. తరచూ ఇంట్లో గొడవలు పడుతుండడంతో కుటుంబ సభ్యులు వేరే ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో రంజిత్ రెడ్డి గురువారం ఇంట్లో దూలానికి తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుడి తండ్రి బాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్ తెలిపారు.