![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 02:22 PM
మెరుగైన వైద్య సేవలతో అందుబాటులోకి స్తంభాద్రి హాస్పిటల్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికత,అత్యుత్తమ నిపుణుల వైద్య బృందంతో ప్రజానీకానికి నాణ్యతతో కూడిన మెరుగైన వైద్యసేవలు అందించేందుకు స్తంభాద్రి హాస్పిటల్ ను నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర డిప్యూటీ సీఎంతో పాటుగా రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,సీపీఐ పార్టీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, విచ్చేశారు. ఖమ్మంలోని నెహ్రూ నగర్ లో నూతనంగా నిర్మించిన స్తంభాద్రి హాస్పిటల్ ను ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరం నడిబొడ్డులో ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటుగా నల్గొండ, వరంగల్ జిల్లాలోని సామాన్యమధ్యతరగతి ప్రజానీకానికి అత్యాధునిక సౌకర్యాలతో, మెట్రోపాలిటన్ నగరాలకు ధీటుగా స్తంభాద్రి యాజమాన్యం అడ్వాన్స్ వైద్యం ను అందుబాటులోకి తీసుకు రావడం సంతోషాదయకమని తెలిపారు.