![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 04:33 PM
మాజీ ఎంపీ, బిజెపి నేత రమేష్ రాథోడ్ అకాల మరణం పట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని రమేష్ రాథోడ్ నిలుపుకున్నారని అన్నారు. సామాన్య పేద వర్గాల ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తిగా రాథోడ్ రమేష్ పేరు సంపాదించాలని అన్నారు. ఆయన అకాల మరణం జిల్లా కు తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.