![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:46 PM
పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా మైనింగ్ ఏడీ గంగాధర్, రాయల్టీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డిలు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక నిల్వలపై దాడులు నిర్వహించారు. 235 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 3, 29, 000 ఉంటుందన్నారు. వారం రోజుల లోపు రసీదుకు సరిపడా డబ్బులు చెల్లించి తీసుకోవచ్చన్నారు. డబ్బులు చెల్లించకుంటే ఇసుకను వేలం వేస్తామని చెప్పారు.