![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 08:05 PM
గతంలో బీఆర్ఎస్ నడిచిన బాటలోనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పయనం కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. . బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తామూ అలాగే ఆలోచిస్తే అనే విషయాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సున్నితంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీలో కలుపుకునే అవసరం తమకు లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం సరైంది కాదన్నారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలోనూ జనసేన పార్టీతో పొత్తు గురించి ప్రశ్నించగా.. రాష్ట్రంలో జనసేనతో కలిసి నడిచే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.