![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 03:28 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం అవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి, వారి అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.