![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:02 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేర్ మండల గ్రామశివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 45మంది కూలీలను తరలిస్తున్న బొలెరో వాహనం బోల్తా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్ తో వాహనం కంట్రోల్ కాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మహాసముద్రం కోడేర్ గ్రామాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.