![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 08:15 PM
తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి.. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్నారి కలనెరవేరింది. మొత్తం 18వేల942మందికి ఈ పదోన్నతులు దక్కగా.. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్-1 (ప్రభుత్వ, స్థానిక సంస్థలు)లకు సంబంధించి.. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 10,083, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు - 1,094మందికి ప్రమోషన్లు దక్కాయి. మల్టీజోన్-2 విషయానికి వస్తే.. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ - 6,989 స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు - 776మందకి పదోన్నతలు వచ్చాయి.
విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది.. అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది. గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా.. ఆన్లైన్లో అత్యంత పారదర్శకతతో పూర్తిచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతులు అర్హతకు తగినట్లు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.