![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 08:16 PM
మెదక్ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చేగుంట మండలం వడియారం దగ్గర బైపాస్రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక లారీలో క్యాబిన్లో కూర్చున్న నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. . ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.