![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:46 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల డాక్టర్ బిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పీయా చిన్నమ్మ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ. భారత దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త సదాశివయ్య పాల్గొన్నారు.