![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:56 PM
నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలకు జరిమానాలు విధిస్తామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ శివశంకర్ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణ శివారు ఎర్రగుట్ట వద్ద ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు లేని 23 వాహనాలపై జరిమానా విధించినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని అన్నారు.