![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:49 PM
రానున్న వర్షాకాలం దృష్ట్యా గోదావరి నది వరదలపై ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మణుగూరు సీఐ ఎస్ సతీష్ కుమార్ కోరారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి వరద ముంపు ప్రాంతమైన చిన్నరావిగుడం గ్రామస్థులతో శనివారం సమావేశం నిర్వహించారు. గోదావరి వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి వరద ప్రవాహం ఉన్నప్పుడు చేపల వేటకు వెళ్లొద్దని సీఐ సూచించారు.