![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 01:12 PM
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయాన్ని హైదరాబాదులో శిక్షణ పొందుతున్న శ్రీలంక దేశానికి చెందిన జర్నలిస్టులు అధికారులు శిక్షణలో భాగంగా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ శిల్పకళా ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు.