![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:04 PM
నారాయణపేట పట్టణంలోని జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయాన్ని శనివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై అరా తీశారు. దన్వాడ, దామరగిద్ద మండలాలకు అంబులెన్స్ మంజూరు చేయాలని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. అధికారులు పాల్గొన్నారు.