by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:47 PM
ఇండియా క్రికెట్ టీం టీట్వంటీ వరల్డ్ కప్ కప్ సాధించిన శుభ సందర్బంగా మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో ఆదివారము గ్రామ యువకులు చెట్లు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగారపు కృష్ణారెడ్డి, అభిలాష్ రెడ్డి, నవీన్, జగన్, మధు, తిరుపతి రెడ్డి విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.