![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:08 PM
డిండి మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి, ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.