by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:31 PM
రామగుండం లయన్స్ క్లబ్ 2024-25 నూతన కార్యవర్గం శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా పి మల్లికార్జున్ సెక్రటరీ వడ్లకొండ ఎల్లప్ప ట్రెజరర్ పాకాల గోవర్ధన్ రెడ్డి లతో పాటు మిగతా కార్యవర్గాన్ని ముఖ్య అతిథులు ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ సింహరాజు కోదండరాం ప్రమాణస్వీకారం చేయించారు. విశిష్ట అతిధులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.