![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:00 PM
మాజీ మంత్రి, ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అకాల మరణంపై మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ గా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.