![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:09 PM
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ మృతి పట్ల శనివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. శ్రీనివాస్ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వారి కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించి ఆమె ఓదార్చారు. మంత్రిగా, పీసీసీ చీఫ్ గా, ఎంపీగా శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.