![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:18 PM
కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఎస్ గా డిప్యూటేషన్ పై వెళ్లారు. చంద్రమోహన్ 2022 జనవరి 21న కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ గా వచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్ళు ఇక్కడ పని చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికే రెవెన్యూ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు.