by Suryaa Desk | Sat, Jun 29, 2024, 01:36 PM
ఓ. యు. విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ నిరుద్యోగుల సమస్యలపై నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణం మద్దతు ప్రకటిస్తూ నల్గొండ కేంద్ర గ్రంథాలయము నుండి క్లాక్ టవర్ వరకు నిరుద్యోగులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.గ్రూప్ 2 & 3 లలో పోస్ట్ పెంచి పరీక్షలను డిసెంబర్ లో నిర్వహించాలని, డీఎస్సీ పోస్ట్ ల పెంపుతో పాటు పరీక్షకు టైం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ పై స్పష్టత తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.