![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:48 PM
కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన వనపర్తి జిల్లా స్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. విద్యా కేంద్రాల్లోనూ, సంక్షేమ హాస్టల్లోనూ యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి కానీ వాడకం కానీ జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కి ఫిర్యాదు చేయాలని, జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దామని కలెక్టర్ సూచించారు.