![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:10 PM
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను గురువారం ఢిల్లీలోని తన నివాసంలో నారాయణపేట బీజీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు.