![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 11:41 AM
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో గురువారం ఏఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసలపై దోమ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.