|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:34 PM
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరించలేని కాలు నొప్పితో బాధపడుతున్న ఓ వృద్ధుడు, ఉపశమనం కోసం అధిక మోతాదులో నొప్పి నివారణ మాత్రలు వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.పోలీసుల కథనం ప్రకారం.. భగత్సింగ్ నగర్కు చెందిన పుల్లూరి కనకయ్య (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఇటీవల మళ్లీ అదే కాలుకు గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు.ఈ నొప్పిని తట్టుకోలేక సోమవారం ఆయన అధిక సంఖ్యలో మాత్రలు వేసుకున్నారు. సుమారు రెండు గంటల తర్వాత నీరసంగా ఉందని చెప్పడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం కనకయ్య మృతి చెందాడు. నొప్పి నివారణ మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.