![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:02 PM
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ట్ లో పారిశుద్ధ్యం, ఉపాధిహామీ, స్వచ్చ భారత్, హరితహారం కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, ఎంపీఓలతో సమావేశం అయ్యారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జడ్పీ సీఈఓ యాదయ్య, డిఆర్డిఎ పీడీ ఉమాదేవి, డీపీఓకే రమణ మూర్తి పాల్గొన్నారు.