![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:14 PM
విద్యార్థులకు నోటు పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబివిపి జిల్లా కన్వీనర్ నరేష్ అన్నారు. నారాయణపేట మండలం సింగారం వద్ద వున్న ద్వారక పాఠశాలలో నోటు పుస్తకాలు అమ్ముతున్నారని అందిన సమాచారం మేరకు పాఠశాలను పరిశీలించారు. విక్రయించేందుకు సిద్ధం చేసిన నోటు బుక్కులను స్వాధీనం చేసుకొని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.