by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:07 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల డైరీ కళాశాలలో గురువారం సమాచార హక్కు చట్టం రాష్ట్ర అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, ఆర్టిఐ రాష్ట్ర డైరెక్టర్ ఎం. ఏ. సలీం విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న, సలీం మాట్లాడుతూ బీబీపేటకు చెందిన కొంగరి నాంపల్లి సమాజానికి చేసినటువంటి నిస్వార్థ సేవలను గుర్తించి పురస్కారం అందజేయడం జరిగిందన్నారు.