![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:21 PM
జగిత్యాల జిల్లాలో కూతురితో కలిసి తల్లి బావిలో దూకింది. స్థానికుల వివరాలు.. సారంగపూర్ మండలం అర్పల్లికి చెందిన బొండ్ల మౌనికకు ఆమె భర్తతో నిన్న రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక కూతురితో కలిసి బావిలో దూకింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.