![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:23 PM
జిల్లాలో రైతు రుణమాఫీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణ మాఫీ సన్నద్దత పై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు.రుణమాఫీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 61 వేల 343 రైతులు ఉండగా ఇందులో 40వేల 567 మంది రైతులకు 240 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు.