![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 12:52 PM
ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని ఎఫ్డీపీటీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ శాంతారాం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చోడ మండలం బాబ్జిపేట్ పరిధిలో ఆక్రమణకు గురైన అటవీ భూమిని డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావుతో కలిసి పరిశీలించారు. భూమి ఆక్రమించిన వారితో పాటు కేశవపట్నం గ్రామస్థులతో మాట్లాడారు. వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు.