![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 01:34 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం తునికి జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుండి ఢీకొట్టడంతో, జక్కపల్లి గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ అనే ఒక వ్యక్తి కారులోనే మృతి చెందారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.