![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 01:35 PM
మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ బి. అనురాధ అన్నారు. శుక్రవారం పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. లోక్ సభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించినందుకు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మత్తుపదార్థాలు, పేకాట, జూదంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు.