![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 01:55 PM
జూలూరుపాడు మండలం పడమటి నరసాపురంలో ద్విచక్రవాహనంపై నాటుసార తయారీకి వినియోగించేందుకు బెల్లం, పట్టిక తరలిస్తుండగా ఆప్కారి సీఐ జయశ్రీ, సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. పడమటి నర్సాపురానికి చెందిన లక్ష్మణ్ 10 కిలోల బెల్లం 2 కిలోల పట్టిక తీసుకుని వెళుతుండగా అబ్కారీ సిబ్బంది పట్టుకున్నారు. అతడిని విచారించగా అదే గ్రామానికి చెందిన వ్యాపారి విక్రయించినట్లుగా తెలిపారని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.