![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 02:12 PM
దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీవీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ. దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.