![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 02:17 PM
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద వాణీ నగర్, బీట్ బజార్, పురాణి పేటకు చెందిన గంగపుత్రులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కండ్లపేల్లి చెరువు వద్ద అక్రమ సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. చెరువు శిఖం భూమిని ఆక్రమించుకుని సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని, దీనివల్ల ఈ చెరువులొ చేపల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న గంగపుత్రులు రోడ్డున పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.