![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:15 PM
నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు మదీనా కాలనీకి చెందిన జాకిర్ అలీ గత 20 సంవత్సరాల నుండి బస్ స్టాండ్ ఎదురుగా పాన్ షాప్ నడుపుతూ జీవనం సాగించేవాడు. నల్గొండ రోడ్డు వెడల్పు పనుల భాగంగా జాకిర్ పాన్ షాప్ తీసి వేయాలసి వచ్చింది. అప్పటి నుండి పూట గడవక అప్పుల పాలై మనస్తాపనికి గురై బుధవారం రాత్రి ఎలుకల మందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిప్తం గురువారం మృతి చెందారు.