![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:19 PM
నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి అటవీ రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 20 ఏళ్ల తరువాత పెద్దపులులు, మొదటిసారి అరుదైన పక్షి రాబందు కనిపించాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగా కనిపించిన రెండు పెద్దపులులు శ్రీశైలం ప్రాంతం నుండి ఇటుగా వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చిరుతలు, ఎలుగు బంట్లు, మనుబోతులు ఇతర వన్య ప్రాణులు విరివిగా ఉన్నాయి.