![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:46 PM
నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో బోధించుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నారాయణ్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, బటాని సబ్జెక్టులో ఒక్కో పోస్టు, తెలుగు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో రెండు చొప్పున ఖాళీలు వున్నాయని, జులై 1 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.