![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:08 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేత ప్రేమ్ కుమార్ ను బల్మూరి రాజు అనే వ్యక్తి శుక్రవారం ఉదయం అంతు చూస్తానని వాట్సప్ మెసేజ్ ద్వారా బెదిరించారని ప్రేమ్ కుమార్ తెలిపారు. డిండి ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమలపై ప్రశ్నించినందుకు ఈ వ్యక్తి బెదిరింపు పాల్పడినట్లు వెల్లడించారు. ఇతడిపై డిండి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.