![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:06 PM
కొయిలకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు తమ పరిదిలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వానాకాలం కావడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు ప్రతి రోజు చేపట్టాలని, వ్యాధులు సోకకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.