![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:11 PM
ఆసుపత్రులలో సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించాలని చెప్పారు. తనిఖీలు చేస్తుండగా ఆసుపత్రికి ఆలస్యంగా వచ్చినా డాక్టర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.