![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:12 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని హెచ్పి పెట్రోల్ పంప్ వెనకాల భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య శివలీల భర్త శివపై కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మృతుడి భార్య శివలీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.