![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:16 PM
భిక్కనూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేశారు. బ్లాక్ పేపర్ గ్లాస్ ఉన్న వాహనాలతో పాటు నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. మొత్తం 30 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 60 వేలు జరిమానాలు విధించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.