by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:57 PM
నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా రైతుల భూముల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అన్నారు.