![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:01 PM
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.