![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:52 PM
ప్రజలు తమ ఇంటి పరిసరాలను, ఇళ్లను పరిశుభ్రంగా పెట్టుకోవాలని మున్సిపల్ కమిషనర్ సునీత, వార్డు కౌన్సిలర్ శిరీష చెన్నారెడ్డి అన్నారు. శుక్రవారం డ్రై డే పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలోని 8 వార్డులోను అశోక్ నగర్ విధిలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్లలో తొట్టెలో ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయరాదని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కాలని పెద్దలు పాల్గొన్నారు.