![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 04:20 PM
గర్భిణీలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని జిల్లా మహిళా సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ శిరీష చెప్పారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో గల పి హెచ్ సిలో గర్భిణీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, బిడ్డకు బిడ్డకు మధ్య ఉండే దూరం పాటించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.