![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 04:02 PM
ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్ లో పాపన్న విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న సేన నేర్ధం భాస్కర్ గౌడ్, గజ్జెల సత్యరాజ్ గౌడ్, బూత్కూరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న 315 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.